close
Choose your channels

'ఎవడు' మార్పుల్లో అదొకటా?

Saturday, September 21, 2013 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'మగధీర' విడుదల తేది అయిన జులై 31న రిలీజ్ కావాల్సిన రామ్ చరణ్ తాజా చిత్రం 'ఎవడు' అనివార్య కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంక్రాంతిని రిలీజ్ ముహుర్తంగా ఫిక్స్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ లోపు ఈ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న మైనస్ లను ప్లస్ లుగా మార్చే పనిలో ఆ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి నిమగ్నమయ్యారని కొన్ని కథనాలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.

ఈ మార్పులేవో సన్నివేశాలకే పరిమితం కాకుండా ఓ పాట విషయంలోనూ జరగనుందని ఓ వార్త వినిపిస్తోంది. ఇంతకీ ఆ పాట ఏమిటంటే. అయ్యో పాపం. సినిమాలో ప్రత్యేక గీతంగా వచ్చే ఈ పాట పది నెలల క్రిందటే లీక్ అయ్యింది. చిత్రీకరణ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో. ఇప్పుడు విడుదలకు ఎలాగూ సమయం ఉంది కాబట్టి ఆ పాటని మరింత లుకబుల్ గా షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్నది ఆ న్యూస్ లోని విశ్లేషణ.

ఎవడుకి చేస్తున్న మార్పుల్లో సదరు ఐటం సాంగ్ కి కూడా స్థానముందో లేదో అతి త్వరలోనే తెలుస్తుంది.

Follow us on Google News and stay updated with the latest!