close
Choose your channels

'చూసినోడికి చూసినంత' : శివాజీ

Saturday, November 23, 2013 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పిఎస్ఆర్ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మిస్తున్న సినిమా 'చూసినోడికి చూసినంత' అంటున్న శివాజీ...'. శివాజీ, లెస్లీయె జంటగా నటిస్తున్నారు. పిఎస్ఆర్ నిర్మాత. అనిల్ వటుపల్లి దర్శకుడు. ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.

షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటున్న సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ 'మిగిలిన రెండు పాటలను బ్యాంకాక్ లో చిత్రీకరించాలనుకుంటున్నాం. అవి కూడా ఈ నెల చివరికంతా చిత్రీకరణను పూర్తి చేస్తాం. ఇందులో శివాజీ పాత్ర చాలా బాగుంటుంది. అలాగే దర్శకుడు మొదటి సినిమా అయినప్పటికీ చక్కగా తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

దర్శకుడు అనిల్ మాట్లాడుతూ 'సినిమాకి తగినట్లే టైటిల్ ఉంటుంది. కామెడీ మిళితమైన లవ్ కథాంశంతో సినిమాని రూపొందిస్తున్నాం' అని అన్నారు. కృష్ణుడు, నాగబాబు, ప్రభాస్ శ్రీను, పృథ్వీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, పాటలుః తిరుపతి, నిర్మాతః పిఎస్ఆర్, దర్శకత్వం: అనిల్ వటుపల్లి

Follow us on Google News and stay updated with the latest!