close
Choose your channels

'ప్యార్ మే పడిపోయానే' 90% టాకీ పూర్తి

Monday, January 13, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా 'ప్యార్ మే పడిపోయానే'. ఆది, శాన్వి హీరోహరోయిన్లు. కె.కె.రాధామోహన్ నిర్మాత. రవిచావలి దర్శకుడు. ఈ సినిమా 90% టాకీని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ 'డిసెంబర్ 16నుండి ఈనెల 8 వరకు జరిగిన రెండో షెడ్యూల్ తో 90 శాతం టాకీ పూర్తైంది. పాటలు, కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ నెల చివరి వారంలో బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేస్తాం' అని అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ 'రవి చావలి డిపెరెంట్ లవ్ స్టోరిని తెరకెక్కిస్తున్నారు. ప్రేమకావాలి, లవ్ లీ, తర్వాత ఈ సినిమా మరో హిట్ మూవీ అవుతుంది. శాన్వితో రెండోసారి జత కడుతున్నాను. అనూప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా మరో మ్యూజికల్ హిట్టవుతుంది' అని అన్నారు. ఆది, శాన్విలతో పాటు వెన్నెలకిషోర్, కాశీవిశ్వనాథ్, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, పృథ్వీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరాః టి.సురేంద్రరెడ్డి, సంగీతం: అనూప్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాతః ఎమ్మెస్ కుమార్, నిర్మాతః కె.కె.రాధామోహన్, రచన, దర్శకత్వం: రవిచావలి

Follow us on Google News and stay updated with the latest!