close
Choose your channels

'ప్యార్ మే పడియానే' టాకీ పూర్తి

Monday, February 3, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ రవిచావలి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ప్యార్ మే పడిపోయానే’. ఆది, శాన్వి హీరోహీరోయిన్లు. ప్రస్తుతం ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా .

నిర్మాత కె.కె.రాధా మోహన్ మాట్లాడుతూ మా చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. పాటల చిత్రీకరణ ఈ నెలతో పూర్తవుతుంది. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. రవిచావలి సినిమాని చక్కగా తెరకెక్కిస్తున్నారు. ఇది వరకు మా బ్యానర్ లో వచ్చిన ఏమైంది ఈ వేళ, అధినేత సినిమాలు పెద్ద విజయానందుకున్నాయి. ఈ సినిమాతో హ్యట్రిక్ సాధిస్తాం అని అన్నారు.

ఆది, శాన్వి, వెన్నెల కిషోర్, కాశీవిశ్వనాథ్, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. కెమెరాః టి.సురేంద్రరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః ఎం.ఎస్.కుమార్, నిర్మాతః కె.కె.రాధామోహన్, రచన, దర్శకత్వం: రవిచావలి.

Follow us on Google News and stay updated with the latest!