close
Choose your channels

'మనం' సినిమాలో సర్ ప్రైజ్ గా..

Monday, November 18, 2013 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల నటులు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం 'మనం'. 'ఇష్క్' సినిమాతో ఆకట్టుకున్న విక్రమ్ కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ, సమంత హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటోందని సమాచారం.

ఇదిలాఉంటే.. ఈ సినిమాలో ఓ సర్ ప్రైజ్ ని ఇవ్వాలని చిత్ర బృందం భావిస్తోంది. అదేమిటంటే.. సదరు సినిమాలో చివరి నిమిషంలో ఒకే ఒక సన్నివేశం కోసం అఖిల్ ని నటింపజేశారట.

అయితే ఈ విషయాన్ని సినిమా విడుదల వరకు గోప్యంగా ఉంచాలని దర్శకనిర్మాతలు భావించినా.. అనుకోకుండా ఆ వార్త పొక్కడంతో.. సదరు కథనంలో నిజం లేదని చిత్రయూనిట్ చెప్పుకొస్తోందని .. అయితే అందులో అఖిల్ చివరి రీల్ లో కనిపించి సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అదెంత వరకు నిజమో సినిమా రిలీజయ్యాక గానీ తెలియదు. అందాకా వెయిట్ చేయడం తప్ప 'మనం' చేయగలిగిందేమీ లేదు.

Follow us on Google News and stay updated with the latest!