close
Choose your channels

'రామయ్యా వస్తావయ్యా'కి నలుగురు..

Saturday, September 7, 2013 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'రామయ్యా వస్తావయ్యా'. 'బాద్ షా' వంటి హిట్ చిత్రం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా ఇది. సమంత హీరోయిన్ గా.. శ్రుతి హాసన్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతమందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియోని అతి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాపైనే కాదు.. ఆడియో పైనా మొదట్నుంచి మంచి అంచనాలను పెంచుతూ వస్తున్నాడు. అందుకు తగ్గట్లే ఇటీవల విడుదలైన జాబిల్లి నువ్వే చెప్పమ్మా.. పాట టీజర్ కి మంచి స్పందన రావడంతో.. మిగిలిన పాటలను కూడా వినాలని తారక్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రామయ్యాకి.. మొత్తం నలుగురు పాటల రచయితలు పనిచేశారని.. వారు అందించిన సాహిత్యం బాగుందని హరీష్ కితాబులిస్తున్నాడు.

ఇంతకీ ఆ నలుగురు రచయితలెవరని ఆరా తీస్తే.. సాహితి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, శ్రీమణి అంటూ వారి లిస్ట్ ని ఉత్సాహంగా చెప్పేసాడు. పేర్లు వినడానికి బావున్నాయి.. పాటలెలా ఉంటాయో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

Follow us on Google News and stay updated with the latest!