close
Choose your channels

'విక్రమ సింహా' ముహుర్తం అప్పుడేనట

Monday, September 9, 2013 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న తొలి ఇండియన్ సినిమాగా రజినీకాంత్ నటిస్తున్న 'కొచ్చడయాన్' తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమా' విక్రమసింహా' గా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'యే జవానీ హై దీవాని, 'చెన్నైఎక్స్ ప్రెస్' వంటి ఘనవిజయం సాధించిన హిందీ సినిమాల తో దూకుడు మీదున్న బాలీవుడ్ భామ దీపికా పదుకొణే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. రజినీ తనయ సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఎ.ఆర్.రెహమన్ స్వరాలందిస్తున్న ఈ సినిమా కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని వినాయక చతుర్థిని పురస్కరించుకుని రేపు (సోమవారం) విడుదల చేయనున్నారు. పాటలను విజయదశమి సందర్భంగా అక్టోబర్ లో విడుదల చేసే అవకాశం ఉంటే.. సినిమాని రజినీకాంత్ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 12న కానీ.. క్రిస్మస్ కానుకగా ఆ నెలాఖరులో కానీ రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోందట.

విక్రమసింహాలో రజినీకాంత్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారట. 'ముత్తు' సినిమా తరహాలో ఆ పాత్రల మధ్య భావోద్వేగాలు ఉంటాయని కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుతోందా అని 'కొచ్చడయాన్' కోసం ఎదురుచూస్తున్న రజినీ అభిమానులకు తాజా ముహుర్తం సంతోషాన్నిచ్చే వార్తే.

Follow us on Google News and stay updated with the latest!