close
Choose your channels

16న ఫైట్స్ చేయనున్న'రేసుగుర్రం'..

Tuesday, November 12, 2013 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 'రేసుగుర్రం'. అల్లుఅర్జున్, శృతిహాసన్ లు జంటగా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి నల్లమలుపు బుజ్జి, డా.వెంకటేశ్వరరావు నిర్మాతలు, సురేంద్ర రెడ్డి దర్శకుడు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 16 నుండి యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఇందులో సలోని, ప్రకాష్ రాజ్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వీలైనంత తొందరగా చిత్రీకరణ పూర్తిచేసి వచ్చే సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

Follow us on Google News and stay updated with the latest!