close
Choose your channels

27న 'అత్తారింటికి దారేది'

Monday, September 23, 2013 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' ఈనెల 27న విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే పైరసీ బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అందుకే వెంటనే విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేశారు. పైరసీకి తమ సినిమా గురికావడం బాధాకరమని ఆయన అన్నారు. దీనికి సంబంధించి బీవీయస్ యన్ ప్రసాద్ సోమవారం ప్రెస్ మీట్ పెట్టారు.

ప్రజలు తమకు సపోర్ట్ చేయాలని, పైరసీని అరికట్టాలని ఆయన తెలిపారు. ఇద్దరు ముగ్గురిని ఇప్పటికే పట్టుకుని విచారిస్తున్నట్టు బూరుగుపల్లి చెప్పారు. త్వరలో పైరసీకి సంబంధించి కొత్త సంస్థను ఏర్పాటు చేయడానికి సినిమా పరిశ్రమ ప్లాన్ చేస్తోంది. మరోవైపు బీవీయస్ యన్ ప్రసాద్ కు ఉదయం నుంచి సినీ ప్రముఖులు తమ మద్దతును నేరుగా కలిసి, ట్విట్టర్ ద్వారా కూడా తెలియజేస్తున్నారు.

Follow us on Google News and stay updated with the latest!