close
Choose your channels

50% పూర్తైన గోపి, శ్రీవాస్ సినిమా

Wednesday, June 11, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
View Gopichand Gallery
View Gopichand Gallery

భవ్య క్రియేషన్స్ పతాకంపై గోపిచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ఇప్పటికి 50 శాతం పూర్తైంది. గోపిచంద్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సందర్భంగా..

నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ ‘’ఈ నెల 17 నుండి మరో షెడ్యూల్ ఏకధాటిగా చేయనున్నాం. దాంత్ టాకీపార్ట్ పూర్తవుతుంది. ఆగస్టులో పాటల్ని చిత్రీకరించి సెప్టెంబర్ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మొత్తం ఐదు పాటలుంటాయి. అందులో మూడు పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. అనూప్ మంచి ట్యూన్స్ ఇచ్చారు’’ అన్నారు.

దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ ‘’పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్. లౌక్యం, చాకచక్యం కలగలిసిన యువకుడి పాత్ర తనది. బ్రహ్మానందం పాత్ర కూడా సినిమాకి హైలైట్’’అన్నారు.

Follow us on Google News and stay updated with the latest!