close
Choose your channels

రేపే బాల‌య్య వందో సినిమా ప్ర‌క‌ట‌న‌..

Thursday, April 7, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వందో సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఉగాది రోజున అన‌గా రేపు ప్ర‌క‌టించ‌నున్నారు. అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ భారీ చిత్రాన్ని క్రిష్ ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తుండ‌డం విశేషం. చారిత్రాత్మ‌క క‌థాంశమైన గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి క‌థతో ఈ సినిమా రూపొందుతుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలోని బుధ్ధ విగ్ర‌హం వ‌ద్ద బాల‌య్య రేపు ఉద‌యం 10.30 నిమిషాల‌కు వందో సినిమాను ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీమ్ అంతా రేపు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న న‌టించే క‌ధానాయిక ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క సినిమాకి సంబంధించిన‌ పూర్తి వివ‌రాలు రేపు ప్ర‌క‌టిస్తారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.