close
Choose your channels

మరోసారి నోరు జారిన బాలయ్య....

Wednesday, April 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య సావిత్రి ఆడియో ఫంక్ష‌న్లో అమ్మాయికి ముద్దు అయినా పెట్టాలి..కడుపు అయినా చేయాలి...అంటూ చేసిన వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత ఈ వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయ నాయ‌కులు సైతం అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో బాల‌య్య మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఈ సంఘ‌ట‌న జరిగి దాదాపు 45 రోజులు అవుతుందేమో. ఇంత‌లోనే బాల‌య్య ఆడియో వేడుక‌లో మ‌రోసారి నోరు జారారు.
ఇంత‌కీ బాల‌య్య ఏమ‌న్నారంటే...త్రిష న‌టించిన నాయ‌కి ఆడియో ఫంక్ష‌న్ కి బాల‌కృష్ణ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ ఆడియో వేడుక పై బాల‌య్య మైక్ ఆన్ లో లేదు అనుకున్నారేమో....సిగ‌రెట్ తాగ‌నివ్వ‌రు అమ్మాయిల్ని ముద్దు పెట్టుకోనివ్వ‌రు, క‌డుపు చేస్తా అంటే అదీ కాదంటారు..అంటూ స‌ర‌దాగా అన్నారు. బాల‌య్య స‌ర‌దాగా అన్న‌ ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మ‌రి..మాట్లాడేట‌ప్పుడు ముఖ్యంగా ఆడియో వేడుక‌ల్లో పాల్గొన్న‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాలి..స‌ర‌దాకి కూడా నోరు జార‌కూడ‌దు అని బాల‌య్య‌ ఎప్పుడు తెలుసుకుంటాడో..?

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.