close
Choose your channels

ప్లాటినం డిస్క్ ప్లాన్ లో బెంగాల్ టైగ‌ర్..

Tuesday, November 24, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాస్ రాజా ర‌వితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగ‌ర్. ఈ చిత్రాన్ని సంప‌త్ నంది తెర‌కెక్కించారు. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కె.కె.రాధామోహ‌న్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న త‌మ‌న్నా, రాశీ క‌న్నాన‌టించారు. భీమ్స్ సంగీతాన్నిఅందించిన బెంగాల్ టైగ‌ర్ ఆడియోకి మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

ఈ సంద‌ర్భంగా ఆడియో సాధించిన విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని ప్లాటినం డిస్క్ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 30న‌ హైద‌రాబాద్ లో బెంగాల్ టైగ‌ర్ ప్లాటినం డిస్క్ వేడుక‌ను సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో చేయ‌నున్నారు. బొమ‌న్ ఇరానీ, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రానే త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌లు పోషించిన బెంగాల్ టైగ‌ర్ మూవీని డిసెంబ‌ర్ 10న రిలీజ్ చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.