close
Choose your channels

తెలుగు సినిమాను రీమేక్ చేస్తున్న బాలీవుడ్ స్టార్....

Monday, February 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ ఇప్పుడు మున్నాభాయ్ మూడో సీక్వెల్‌కు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సీనియ‌ర్ హీరో ఇప్పుడు ఓ తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఇంద‌కు సంజ‌య్ ద‌త్ మ‌న‌సు ప‌డ్డ ఆ తెలుగు సినిమా మ‌రేదో కాదు..ప్ర‌స్థానం. సాయికుమార్‌, శ‌ర్వానంద్‌, సందీప్‌కిష‌న్‌లు ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ తెలుగులో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. హిందీలో కూడా ఈ సినిమాను దేవాక‌ట్టానే డైరెక్ట్ చేస్తాడ‌ని, సంజ‌య్‌ద‌త్ సినిమాను నిర్మిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా గురించిన మ‌రిన్ని వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.