close
Choose your channels

బోయపాటి శ్రీను - బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమా ప్రారంభం..!

Friday, September 23, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో స‌రైనోడు సినిమాని తెర‌కెక్కించి ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను త‌దుప‌రి చిత్రాన్ని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్ధ నిర్మిస్తుంది. విభిన్న ప్రేమ‌క‌ధా చిత్రంగా రూపొందే ఈ చిత్రాన్ని ఈరోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు.
ఈ మూవీలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. అలాగే బోయ‌పాటి తెర‌కెక్కించిన స‌రైనోడు సినిమాలో విల‌న్ గా న‌టించిన ఆది పినిశెట్టి ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.