|
టాలీవుడ్, కోలీవుడ్ లో హవా కొనసాగిస్తున్న మిల్కీవైట్ భామ తమన్నా బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేస్తోంది. తొలి రోజుల్లో ఐరెన్ లెగ్ గా ముద్దు వేయించుకున్న ఈ ఉత్తరాది చిన్నది ఇప్పుడు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లో బిజీగా ఉన్న తమన్నా... కాల్షీట్లు సర్దుబాటు కాకపోవటంతో కోలీవుడ్ కి కొంత విరామమిచ్చింది.
వరుస అవకాశాలతో డిమాండ్ పెరగటంతో తమన్నా తన పారితోషికాన్ని ఏకంగా కోటికి పెంచేసింది. అయితే తాను కోటి డిమాండ్ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది. తన ప్రతిభకు తగ్గ పారితోసికాన్ని నిర్మాతలు ఇస్తున్నారని తెలిపింది. తనకు ఇంత పారితోషికం కావాలని ఏ నిర్మాతను డిమాండ్ చేయలేదని తెలిపింది.
సమయం సరిపోకపోవటంతో ప్రస్తుతం కోలీవుడ్ అవకాశాలనే సద్వినియోగం చేసుకోలేకపోతున్న తనకు బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్లు చెప్పింది. అయితే ప్రస్తుతం హిందీ చిత్రాలుచేసే ఆలోచన లేదని, భవిష్యత్ లో తప్పకుండా బాలీవుడ్ లో పాగా వేస్తానని, అక్కడ కూడా సత్తా ఎంటో చూపుతానంటోంది ఈ చిన్నది.
|