|
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'దమ్ము' చిత్రానికి అన్ని చోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ చిత్రమిది. యాక్షన్, సెంటిమెంట్, రొమాంటిక్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. ఆయన పాత్ర అంత బాగా రావడానికి దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ కారణం అన్నారు కె.ఎస్. రామారావు. ఆయన సమర్పణలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నిర్మించిన చిత్రం 'దమ్ము'.
త్రిష, కార్తీక నాయికలు. బోయపాటి శ్రీను దర్శకుడు. కె.ఎ. వల్లభ నిర్మాత. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందు కొచ్చింది. ఈ సందర్భంగా కె.ఎస్. రామారావు మాట్లాడుతూ ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా 1450 ధియేటర్లలో విడుదలైన 'దమ్ము' సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు దాదాపు పన్నెండున్నర కోట్లు వసూలు చేసింది.
ఆంధ్రవూపదేశ్లోని అన్ని ఏరియాలతో కలిపి 9 కోట్ల షేర్ వసూలు చేసి రికార్డు కలెక్షన్స్ సాధిస్తోంది. ఎన్టీఆర్లోని అద్భుతమైన నటుణ్ణి వెలికి తీసిన చిత్రమిది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఇంటిల్లిపాది థియేటర్లో కూర్చుంటే ఒక్కొక్కరు ఒక్కో ఎమోషన్కు కనెక్ట్ అయి వారికి తెలియకుండానే కంటితడి పెడతారు. అలాగే ఎన్టీఆర్ లాంటి బిడ్డ మాకు లేడని ఫీలవుతారు. అన్ని రకాల ఎమోషన్స్తో రూపొందిన ఫుల్మీల్స్ లాంటి చిత్రమిది. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు అన్నారు. నిర్మాతగా నేను నిర్మించిన తొలి చిత్రమే భారీ విజయాన్ని సాధించడం ఆనందంగా వుంది' అని కె.ఎ. వల్లభ అన్నారు.
|