|
హీరో శివాజీ, సదా జంటగా ఆర్.ఆర్. సినీ పిక్చర్స్ పతాకంపై సి.హెచ్. వి.ఎస్.ఎన్. బాబ్జీ, యస్.రత్నమయ్య సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సతి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ భూతాలు, దెయ్యాలు అనేవి లేవని, అవన్నీ భ్రమలని తెలిపే కథ ఇది. మార్చి 30 నుంచి రెండవ షెడ్యూల్ ప్రారంభించి ఏప్రిల్ 13వరకు చేశాం.
ఈ షెడ్యూల్తో క్లైమాక్స్, రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయింది. ఏప్రిల్ 23 నుంచి సారథి స్టూడియోస్లో క్లైమాక్స్ని చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నాం. రెండు పాటల్ని మే 15 లోగా చిత్రీకరిస్తాం. సాటి మనిషి కష్టాల్లో వున్నపుడు నీకు చేతనైనంత సహాయం చేసి సహకరించు అదే నీకు శ్రీరామరక్ష అని ఈ చిత్రం ద్వారా చెబుతున్నాం. 55 నిమిషాల గ్రాఫిక్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు.
విజయచందర్, కృష్ణభగవాన్, కొండవలస, చిత్రం శ్రీను, ఫిష్ వెంకట్, రాధాకృష్ణ, తాగుబోతు రమేష్, ధన్రాజ్, ప్రసాద్, జయవాణి, బేబి సంచలన తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: రవిరెడ్డి, రామకృష్ణ, ఛాయాగ్రహణం:వి.యన్. సురేష్కుమార్, ఎడిటింగ్: ఉపేంద్ర, కథ- స్క్రీన్ప్లే-దర్శకత్వం: సతి శ్రీనివాసరెడ్డి.
|