|
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'గబ్బర్ సింగ్' ఓ పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మిగిలి ఉన్న ఆ డ్యూయెట్ సాంగ్ను హీరో హీరోయిన్లు పవన్ కల్యాణ్, శ్రుతీహాసన్పై జెనీవాలో చిత్రీకరిస్తున్నారు. స్విట్జర్లాండ్లోని అత్యధిక జనాభా కలిగిన రెండో నగరమైన జెనీవా ప్రపంచంలోనే అత్యంత సుందర నగరాల్లో ఒకటి. అక్కడి లొకేషన్లలో శుక్రవారం (ఏప్రిల్ 27న) ఈ పాట షూటింగ్ మొదలైంది.
మే 11న 'గబ్బర్ సింగ్'ను విడుదల చేయడానికి నిర్మాత గణేశ్ సంకల్పించడంతో అందుకు తగ్గట్లు షూటింగ్ పూర్తిచేయాలని కొరియోగ్రాఫర్కు పవన్ సూచించాడు.మొత్తం మూడు రోజుల్లోనే ఈ పాటని పూర్తి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా ఇప్పటికే మార్కెట్లో విడుదలైన పాటలు మ్యూజిక్ చార్టుల్లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాయి. 'జల్సా' తర్వాత ఇంతవరకు చెప్పుకోదగ్గ మరో సినిమాలేని పవన్కు 'గబ్బర్ సింగ్' ఆ లోటు పూడుస్తుందని ఆయన అభిమానులు నమ్ముతున్నారు.
|