|
నారా రోహిత్, నిత్యామీనన్ జంటగా రూపొందుతోన్న చిత్రం 'ఒక్కడినే'. శ్రీనివాస రాగ దర్శకత్వంలో సి.వి.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్లో 60శాతం టాకీపార్టు పూర్తయిందని, మూడో షెడ్యూల్లో చిత్రం మొత్తం పూర్తిచేస్తామని తెలిపారు.
ఇంటిల్లిపాది ఆనందించేలా దర్శకుడు శ్రీనివాస రాగ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కుటుంబ బంధాలను కొత్త కోణాల్లో ఆవిష్కృతం చేసే సినిమా ఇది. రోహిత్, నిత్యామీనన్ల మధ్య వచ్చే సన్నివేశాలు యువతరాన్ని కట్టిపడేస్తాయి. రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. చివరి షెడ్యూల్ నేటి నుంచి ఆర్ఎఫ్సీలో మొదలవుతుంది. నిరవధికంగా జరిగే ఈ షెడ్యూల్తో టాకీ పూర్తవుతుంది. ఇక మిగిలిన మూడు పాటలను త్వరలోనే చిత్రీకరిస్తాం. ఇందులో కీలక పాత్రను సాయికుమార్ పోషిస్తున్నారు.
ఆయన కేరక్టర్ ఈ షెడ్యూల్లోనే ప్రవేశిస్తుంది అని చెప్పారు. చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, సత్యకృష్ణన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, కెమెరా: ఆండ్రు బాబు, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: గులాబి మూవీస్.
|