close
Choose your channels

'స్టార్ మా' లోగో ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి

Sunday, February 12, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశంలోనే అగ్ర‌శ్రేణి మీడియా సంస్థంగా పేరు పొందిన స్టార్ ఇండియా త‌న పోర్ట్ పోలియో ఛానెల్ మా టీవీ..త‌మ కొత్త బ్రాండ్ పొజిష‌న్‌ను, అహ్లాద‌క‌ర‌మైన లుక్‌ను చైత‌న్య‌వంత‌మైన కొత్త కలోగో, బ్రాండ్ ట్యాగ్‌లైన్‌, న్యూ మోనిక్ థీమ్ ట్రాక్‌ను ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో ఆవిష్క‌రించింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రై, కొత్త లోగోను, ట్యాగ్ లైన్‌ను ఆవిష్క‌రించి అనే బంధం..స‌రికొత్త ఉత్తేజం అనే ట్యాగ్‌లైన్ ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా...

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ``దాదాపు ప‌దేళ్లు ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్నాను. 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చేట‌ప్పుడు న‌న్ను ప్రేక్ష‌కులు ఎలా స్వీక‌రిస్తారోన‌ని అనుకున్నాను. కానీ నా అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ ప్రేక్ష‌కులు నాకు దిగ్విజయ‌మైన విజయాన్ని అందించారు. తెలుగు ప్రేక్ష‌కులు ఒక‌సారి అభిమానిస్తే, ప్రేమిస్తే ఎప్ప‌టికీ మ‌ర‌చిపోరు అని మ‌రోసారి ప్రూవ్ చేశారు. ఇంత‌లా ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు రుణ‌ప‌డి ఉంటాను. వెండితెర‌పైనే కాకుండా బుల్లితెర‌పై కూడా అడుగుపెడుతున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాలు మాత్ర‌మే వినోదాన్ని అందించేవి..కానీ నేడు టీవీలు కూడా వినోదం రంగంలో ముందుంటున్నాయి. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు మొద‌టి సెష‌న్‌లో ఆర‌వై ఎపిసోడ్స్ ఉంటాయి. సాధార‌ణంగా ఇంత‌కు ముందు గంట‌న్న‌ర‌సేపు వ‌చ్చే ఈ కార్య‌క్ర‌మం ఇక‌పై సోమ‌వారం నుండి గురువారం వ‌ర‌కు రాత్రి 9.30 నిమిషాల నుండి 10.30 నిమిషాల వ‌ర‌కు ప్ర‌సార‌మ‌వుతుంది.

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రోగ్రామ్‌తో చేసేట‌ప్పుడు ఎమోష‌న‌ల్‌గా అనేక అనుభూతుల‌కు లోన‌య్యాను. పేద‌వాడి నుండి డ‌బ్బున్న‌వారి వ‌ర‌కు చాలా మందిని క‌ల‌వ‌డంతో చాలా ర‌కాలైన అనుభ‌వాల‌ను షేర్ చేసుకున్నాను. ఇదొక ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రామ్ కాదు..ఎమోష‌న‌ల్ ప్రోగ్రామ్ ఇదిజ ఇందులో ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు కూడా పాల్గొంటారు. ఇంత‌కు ముందు ఈ ప్రోగ్రామ్‌ను నాగార్జున‌గారు చేసిన‌ప్పుడు నేను అతిథిగా హాజ‌ర‌య్యాను. ఇప్పుడు నేను హోస్ట్ చేస్తున్నాను. ఇందులో నాగార్జున పాల్గొంటారు. అలాగే వెంక‌టేష్‌గారు కూడా పాల్గొంటానని మాట ఇచ్చారు. బాల‌కృష్ణ‌గారిని కూడా అహ్వానిస్తాం. వుమెన్స్ డే స్పెష‌ల్‌గా ఈ కార్య‌క్ర‌మంలో రాధిక‌, సుమ‌ల‌త కూడా పాల్గొంటారు. నా ఇమేజ్ ఈ ప్రోగ్రామ్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతుంద‌ని అనుకుంటున్నాను. అలాగే ప్రేక్ష‌కుల‌కు చేరువ కావ‌డానికి ఈ ప్రోగ్రామ్ ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. ఈ ప్రోగ్రామ్ నేను బాగా చేస్తున్నానని తెలిసి బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ న‌న్ను అభినందిచడంగా ఆనందంగా ఉంది`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో స్టార్ ఇండియా సౌత్ సి.ఇ.ఒ కెవిన్ వాజ్‌, మా టీవీ బిజినెస్ యూనిట్ హెడ్ అలోక్ జైన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.