close
Choose your channels

పవన్ కు అంతర్జాతీయ పురస్కారం

Tuesday, September 26, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరో, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అంత‌ర్జాతీయ పుర‌స్కారం ల‌భించింది. ఇటీవ‌ల అమెరికాలోని హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ గౌర‌వించిన సంగ‌తి తెలిసిందే. కాగా ఇప్పుడు ఐఈబీఎఫ్ (యూరోపియ‌న్ బిజినెస్ ఫోర‌మ్‌) అందించే ఎక్స‌లెన్స్ అవార్డుకు ప‌వ‌న్ ఎంపిక‌య్యారు. న‌వంబ‌ర్ 17న ఈ అవార్డును ప‌వ‌న్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో అందుకోనున్నారు.

వివిధ రంగాల్లో సేవ‌లందించిన వారికి ఈ అవార్డును బ‌హుక‌రిస్తారు. న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా కోట్ల మంది అభిమానం చూర‌గొన్న ప‌వ‌న్‌కు ఈ అవార్డును ఇవ్వాల‌ని ఐఈబీఎఫ్ నిర్ణ‌యించింది. ఈ మేర ఐఈబీఎఫ్ ఇండియా ప్ర‌తినిధి చంద్ర‌శేఖ‌ర్ ప‌వ‌న్‌ను క‌లిసి ఆహ్వానం అంద‌జేశారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలోని వేలాదిమంది కిడ్నీ వ్యాధి పీడితులను ఆదుకోవడంలో పవన్‌ చూపిన మానవత్వం, చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచి నేత కళాకారులకు వెన్నుదన్నుగా నిలిచిన తీరు, సామాజిక సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ, కృషి అంద‌రినీ ఆకట్టుకుంద‌ని వారుతెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.