close
Choose your channels

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో జయమ్ము నిశ్చయమ్మురా..!

Wednesday, September 14, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

"గీతాంజలి" తర్వాత శ్రీనివాస్ రెడ్డి- "రాజు గారి గది" తర్వాత పూర్ణ జంటగా నటిస్తున్న నేటివిటీ హాస్యభరిత చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా". తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంలో ఉన్న రోజుల్ని గుర్తుకు తెస్తూ... 2013 నేపథ్యంలో- కరీంనగర్ నుంచి కాకినాడ వెళ్లిన ఓ యువకుడి చుట్టూ సాగే సరదా కధే "జయమ్ము నిశ్చయమ్మురా". షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోందని చిత్ర నిర్మాత-దర్శకుడు శివరాజ్ కనుమూరి తెలిపారు.

చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు మాట్లాడుతూ.. "కరీంనగర్, పోచంపల్లి, కాకినాడ, వైజాగ్, భీమిలి మొదలగు లొకేషన్స్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: రవిచంద్ర, కెమెరా: నాగేష్ బన్నేల్, ఎడిటింగ్: ఎడిటర్ వెంకట్, సహ నిర్మాత: సతీష్ కనుమూరి, నిర్మాణం-దర్శకత్వం: శివరాజ్ కనుమూరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.