close
Choose your channels

ప్రభాస్ సరసన కన్నడ భామ

Monday, April 3, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాహుబ‌లి చిత్రం రెండు పార్టులుగా రూపొందింది. అందులో `బాహుబ‌లి 2` ఏప్రిల్ 28న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ర‌న్ రాజా రన్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు.

బాహుబ‌లితో నేష‌న‌ల్ ఫేమ‌స్ అయిన ప్ర‌భాస్ న‌టించనున్న ఈ చిత్రాన్ని కూడా తెలుగు, త‌మిళం, హిందీలో వంద‌కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న క‌న్నడ హీరోయిన్ ర‌ష్మీకా మండ‌న్నా న‌టించ‌నుంది. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లై హిట్ అయిన కిర్రిక్ పార్టీలో న‌టించింది. ఇప్పుడు బాహుబ‌లితో జ‌త క‌ట్ట‌నుండ‌టం రష్మీకి పెద్ద ప్ల‌స్ అవుతుంద‌న‌డంలోసందేహం లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.