close
Choose your channels

పుకార్ల పై క్లారిటి ఇచ్చిన కొర‌టాల‌..!

Wednesday, October 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్...చిత్రాల‌తో వ‌రుస‌గా బ్లాక్ బ‌ష్ట‌ర్స్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. నాలుగ‌వ సినిమాని సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. మ‌హేష్ - కొర‌టాల కాంబినేష‌న్ లో రూపొందే క్రేజీ మూవీని డి.వి.వి. దాన‌య్య నిర్మించ‌నున్నారు. అయితే...ఈ చిత్రం మ‌ల్టీస్టార‌ర్ గా రూపొందనున్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఈ ప్రచారం పై కొర‌టాల శివ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...నా త‌దుప‌రి చిత్రం మ‌ల్టీస్టార‌ర్ మూవీ కాదు. ప్ర‌చారంలో ఉన్న వాటిని ప‌ట్టించుకోవ‌ద్దు అంటూ క్లారిటి ఇచ్చేసాడు కొర‌టాల‌. ఈ భారీ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్త‌య్యింది. జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. శ్రీమంతుడు సినిమాతో మ‌హేష్ కి బ్లాక్ బ‌ష్ట‌ర్ అందించిన కొర‌టాల ఈసారి ఏరేంజ్ స‌క్సెస్ అందిస్తాడో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.