close
Choose your channels

కృష్ణ 'గాజుల కిష్ట‌య్య‌'కి 40 ఏళ్లు

Monday, November 9, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ కృష్ణ కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ చిత్రంగా నిలిచింది 'గాజుల కిష్ట‌య్య‌'. క‌థ ప‌రంగానూ, సంగీతం ప‌రంగానూ అప్ప‌టి ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌కి నోచుకున్న ఈ సినిమాకి నాటి మేటి ద‌ర్శ‌కుడు ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌న తొలి చిత్ర ద‌ర్శ‌కుడు ఆదుర్తితో కృష్ణ చేసిన ఈ హిట్ సినిమాలో జ‌రీనా వ‌హ‌బ్ హీరోయిన్‌గా న‌టించింది.

కె.వి.మ‌హ‌దేవ‌న్ సంగీత‌మందించిన ఈ సినిమాలోని 'న‌వ్వులు రువ్వే పువ్వ‌మ్మా' పాట ఎవ‌ర్‌గ్రీన్‌గా నిలిచింది. న‌వంబ‌ర్ 9, 1975న విడుద‌లైన ఈ సినిమా.. నేటితో 40 వసంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.