close
Choose your channels

మహేష్ , కొరటాల శివ వెనక్కివెళ్లిందా?

Tuesday, February 21, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ మహేష్‌, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో నిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో మ‌హేష్‌, కొర‌టాల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన శ్రీమంతుడు సెన్సెష‌న‌ల్ హిట్ అయ్యింది. ఈ హిట్ కాంబినేష‌న్ రిపీట్ అవుతున్న సినిమా అన‌గానే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌గా రూపొందుతోన్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడో మొద‌లు కావాల్సింది కానీ ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది.
ఈ సినిమాకు భ‌ర‌త్ అను నేను అనే టైటిల్‌ను కూడా రిజిష్ట‌ర్ చేయించారు. ఈ సినిమాను ముందుగా సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేద్దామ‌ని యూనిట్ స‌భ్యులు అనుకున్నారు. అయితే షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో సినిమాను ఈ ఏడాది చివ‌ర్లో కానీ లేదా, వ‌చ్చే ఏడాది సంక్రాంతికి కానీ రిలీజ్ చేయాల‌ని నిర్మాత భావిస్తున్నార‌ని స‌మాచారం. మ‌రి దీనిపై శివ కానీ అత‌ని టీం కానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.