close
Choose your channels

నవంబర్ 4న విడుదలకు సిద్ధమవుతున్న' మనలో ఒకడు'

Sunday, October 23, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం `మ‌న‌లో ఒక‌డు`. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ నిర్మిస్తున్నారు. 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా న‌టించారు. ఈ సినిమాను న‌వంబ‌ర్ 4న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా....
ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ `` `మ‌న‌లో ఒక‌డు`పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఇటీవ‌ల తిరుప‌తిలో వ‌న్ మిలియ‌న్ క్లిక్స్ డిస్క్ ఫంక్ష‌న్స్ నిర్వ‌హించాం. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. కొన్ని య‌దార్థ ఘ‌ట‌నల‌ ఆధారంగా `మ‌న‌లో ఒక‌డు` క‌థ‌ను రాసుకున్నాం. ఈ సినిమాలో నేను కృష్ణ‌మూర్తి అనే అధ్యాప‌కుడి పాత్ర‌లో న‌టించాను. ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర అది. డైలాగ్ కింగ్ సాయికుమార్‌గారి పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. మ‌న‌లో ఒక‌డు` సినిమా ఫస్ట్ కాపీ సిద్ధ‌మైంది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త్వ‌ర‌లో సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను న‌వంబ‌ర్ 4న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అని అన్నారు.
నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ `` ప్ర‌స్తుత స‌మాజంలో మీడియా పాత్ర ఏంటో మ‌నందరికీ తెలుసు. అలాంటి మీడియా నేప‌థ్యంలో సాగే క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాం. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు, థియేట్రిల‌క్ ట్రైల‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఫ‌స్ట్‌కాపీ సిద్ధ‌మైంది. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి న‌వంబ‌ర్ 4న సినిమాను విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం`` అని చెప్పారు.
సాయికుమార్‌, జెమిని సురేశ్ త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమాకు కెమెరామేన్: ఎస్‌.జె.సిద్ధార్థ్‌, స‌హ నిర్మాత‌లు: ఉమేశ్ గౌడ‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, క్రియేటివ్ హెడ్: గౌత‌మ్ ప‌ట్నాయ‌క్‌, పాట‌లు: చైత‌న్య ప్ర‌సాద్‌, వ‌న‌మాలి, పుల‌గం చిన్నారాయ‌ణ‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.