close
Choose your channels

మణిరత్నం ప్రేమికుల రోజు గిఫ్ట్...

Monday, February 6, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఓకే బంగారం చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసిన నిర్మాత‌గా మ‌రో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రానున్న సినిమా `కాట్రు వెలియ‌డు`. కార్తీ, ఆదితిరావు హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్‌లో ఈ చిత్రం తెలుగు, త‌మిళంలో ఓకే రోజున విడుద‌ల కానుంది.

తెలుగులో ఈ సినిమా చెలియా అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలో టీజ‌ర్‌కు, పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ఫిబ్ర‌వ‌రి 14న ప్రేమికుల రోజు సంద‌ర్భంగా మ‌ణిర‌త్నం ఈ సినిమా నుండి మై మ‌ర‌పురా అనే పాట‌ను విడుద‌ల చేస్తున్నార‌ట‌. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కార్తీ ఫైట‌ర్ ఫైల‌ర్ రోల్ చేస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.