close
Choose your channels

ధనుష్ థ్రిల్లింగ్ పెర్ఫామెన్స్ తో 'మరియన్ ' బాక్సాఫీస్ హిట్ సాధించింది - నిర్మాత సి.జె.శోభ

Saturday, November 21, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ధనుష్‌ హీరోగా, పార్వతీ మీనన్‌ హీరోయిన్‌గా భరత్‌బాల దర్శకత్వంలో ఆస్కార్‌ ఫిలింస్‌ ప్రై. లి. పతాకంపై ప్రముఖ నిర్మాత ఆస్కార్‌ వి. రవిచంద్రన్‌ తమిళంలో నిర్మించిన 'మరియన్‌' చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్న సి.జె.శోభ ఇప్పుడు ఎస్‌.వి.ఆర్‌.మీడియా ప‌తాకంపై మరో విభిన్న చిత్రం 'మరియన్‌'ను తెలుగులో అందించారు. నవంబర్‌ 20న రిలీజైన ఈసినిమా థియేట‌ర్ల‌లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ధ‌నుష్ మైండ్‌బ్లోవింగ్ పెర్ఫామెన్స్‌, ఏ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం ఈ సినిమాకి పెద్ద అస్సెట్ అయ్యాయ‌ని చెబుతున్నారు నిర్మాత శోభ‌.

స‌క్సెస్‌ సందర్భంగా నిర్మాత సి.జె.శోభ మాట్లాడుతూ - ''మా ఎస్వీఆర్‌ మీడియా బ్యానర్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాం. ఇప్పుడు 'మరియన్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాం. ఎప్పుడూ డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకునే ధనుష్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఒక అద్భుతమైన క్యారెక్టర్‌ చేసి మెప్పించారు. ధనుష్‌ పెర్ఫామెన్స్‌కి అద్భుత స్పందన వస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ అందించిన సంగీతం స్పెషల్‌ హైలైట్‌ గా నిలిచింది. ఒక యదార్థ సంఘటన ఆధారంగా భరత్‌బాల రూపొందించిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతోంది. తమిళ్‌లో ఆస్కార్‌ రవిచంద్రన్‌గారు నిర్మించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని సాధించింది. తెలుగు ప్రేక్షకుల నుంచి అంతే చక్కని స్పందన వచ్చింది. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు'' అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.