close
Choose your channels

'ధోని' పాక్ లో ఆడటం లేదు

Wednesday, September 28, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌, ఎన్‌ ఇన్‌స్పైర్డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌, ఫ్రైడే ఫిలింవర్క్స్‌ బ్యానర్స్‌పై సుశాంత్‌ సింగ్‌ రాజపుత్‌, కైరా అద్వాని, దిశాపటాని, అనుపమ్‌ ఖేర్‌, భూమిక చావ్లా ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'ఎం.ఎస్‌.ధోని' ..ది అన్‌టోల్డ్‌ స్టోరీ ట్యాగ్‌లైన్‌. నీరజ్‌ పాండే దర్శకత్వంలో అరుణ్‌ పాండే, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ నిర్మాతలుగా సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సెప్టెంబర్‌ 30న విడుదలవుతుంది.

తెలుగు, తమిళం, హిందీల్లో భారీగా విడుదలవుతున్న ఈ సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే భారత్ విడుదలవుతున్న ఈ సినిమా పాక్ లో విడుదల చేయడం లేదని, ఉరి ఘటన తర్వాత భారత్, పాక్ లో నెలకొన్న పరిస్థితులు కారణంగానే ధోని చిత్రాన్ని పాక్ లో విడుదల చేయడం లేదని డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఐ.ఎం.జి.సి.గ్లోబెల్ తెలియజేసింది. పాక్ లోని ధోని అభిమానులకు ఇది కొంత నిరాశను కలిగించే విషయమే మరి...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.