close
Choose your channels

బాహుబ‌లి 2 రైట్స్ పై క్లారిటీ ఇచ్చిన నాగ్..!

Friday, September 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి 2. ఈ చిత్రం ఇటీవ‌ల‌ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్, అనుష్క ల‌పై ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే....బాహుబ‌లి కృష్ణా జిల్లా డిస్ర్టిబ్యూష‌న్ రైట్స్ 6 కోట్ల‌కు అమ్మితే...ఇప్పుడు బాహుబ‌లి 2 కృష్ణా జిల్లా రైట్స్ 8 కోట్ల‌కు అమ్మారు.

అదీ కాకుండా బాహుబ‌లి 2 కృష్ణా జిల్లా రైట్స్ ను నాగార్జున‌, సాయి కొర్ర‌పాటి 8 కోట్ల‌కు సొంతం చేసుకున్నారు అంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఇదే విష‌యం గురించి నాగార్జున‌ను అడిగితే...ఈ వార్త‌ను నేను కూడా చ‌దివాను. చ‌దివిన‌వి అన్నింటిని న‌మ్మ‌ద్దు. ఆ వార్త‌ల్లో వాస్త‌వం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసారు నాగ్. అది సంగ‌తి..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.