close
Choose your channels

చిత్రీకరణ తుది దశకు చేరుకున్న నాని-మోహనకృష్ణ ఇంద్రగంటి చిత్రం

Friday, April 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'అష్టా చమ్మా' తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోంది. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలు. ఈ చిత్రం ఆఖరు షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ - ''ఇదొక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్. థ్రిల్ కు గురి చేసే ఎలిమెంట్స్, మంచి రొమాన్స్, సెంటిమెంట్, వినోదం.. ఇలా అన్ని అంశాలు కుదిరిన కథ. అతి త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం. డిసెంబర్ 2న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాం. హైదరాబాద్, కొడైకెనాల్ లో షెడ్యూల్స్ జరిపాం. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 6 వరకూ కొడైకెనాల్ లో జరిపిన షెడ్యూల్ లో ఒక పాట, కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. మార్చి 14న హైదరాబాద్ లో షెడ్యూల్ మొదలుపెట్టాం. ఏప్రిల్ 6 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్లో ఇంపార్టెంట్ టాకీ, ఒక పాట చిత్రీకరిస్తాం. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. ఏప్రిల్ రెండో వారంలో డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడతాం. మే నెలాఖరున లేక జూన్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.