close
Choose your channels

'నువ్వు తోపురా' తో నిన్నటితరం కథానాయిక నీరోషా రీఎంట్రీ

Saturday, June 24, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హరనాథ్ బాబు.బి దర్శకత్వంలో "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" ఫేమ్ సుధాకర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "నువ్వు తోపురా". యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డి.శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధాకర్ కోమాకుల సరసన నిత్యా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నిన్నటితరం కథానాయకి నిరోష ఓ ముఖ్యపాత్ర పోషిస్తోంది. "సావిత్రి" అనే పాత్రతో నిరోష రీఎంట్రీ ఇస్తుండడం పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. "సీనియర్ హీరోయిన్ నిరోష గారు మా సినిమా ద్వారా మళ్ళీ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తుండడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా బరువైన పాత్రలో నిరోష కనిపించనున్నారు. ఆమె పాత్ర పేరు "సావిత్రి". సినిమాకి ఆమె పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మా దర్శకుడు హరినాధ్ బాబు.బి తెరకెక్కిస్తున్నారు" అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.