close
Choose your channels

ఎన్టీఆర్ సినిమా సినిమాటోగ్రాఫర్ మారాడు...

Wednesday, May 17, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `జై ల‌వ‌కుశ`. ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. మే 20న ఎన్టీఆర్ పుట్టిన‌రోజు కాబ‌ట్టి మే 19న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల కానుంది. ఈ సంగ‌తుల‌ను ప‌క్క‌న పెడితే, ఈ సినిమాకు సి..కె.ముర‌ళీధ‌ర‌న్‌ను సినిమాటోగ్రాఫ‌ర్ ప‌నిచేశాడు.

అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ మ‌ధ్య‌లో సినిమాటోగ్రాఫ‌ర్ మారిపోయాడు. బాబీ, ముర‌ళీధ‌ర‌న్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డం వ‌ల్ల‌నే ముర‌ళీధ‌ర‌ర‌న్‌ను రీప్లేస్ చేశార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ముర‌ళీధ‌ర‌న్‌కు కొన్ని అత్య‌వ‌స‌ర క‌మిట్‌మెంట్స్ ఉండ‌టం వ‌ల్ల‌నే ముర‌ళీద‌ర‌న్ ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయ్యాడ‌ని స‌మాచారం. సి.కె.ముర‌ళీధ‌ర‌న్ స్థానంలో ఛోటా కె.నాయుడు ఇప్పుడు ఈ సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ వ‌ర్క్ చేయ‌నున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.