close
Choose your channels

పాండిచ్చేరిలో 'రాజు గారి గది 2' మూడో షెడ్యూల్!

Tuesday, March 21, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న "రాజు గారి గది" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రమే "రాజు గారి గది 2". కింగ్ నాగార్జున ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సమంత, సీరత్ కపూర్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పివిపి సినిమా-మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్-ఓక్ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ ఇటీవల పాండిచ్చేరిలో మొదలైంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ.. "నాగార్జున గారి కెరీర్ లో ఇప్పటివరకూ ఆయన చేయని వైవిధ్యమైన పాత్రలో ఆయన కనిపించనున్నారు. సమంత పోషిస్తున్న ముఖ్యభూమిక సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. 20 రోజులపాటు పాండిచ్చేరిలో జరగనున్న మూడో షెడ్యూల్ తో 70% టాకీ పార్ట్ పూర్తవుతుంది. ప్రస్తుతం నాగార్జున-నరేష్ ల కాంబినేషన్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది" అన్నారు.
నరేష్, అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్ లు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్ ఎస్.ఎస్, కళ: ఏ.ఎస్.ప్రకాష్, సినిమాటోగ్రఫీ: దివాకరన్, మాటలు: అబ్బూరి రవి, నిర్మాణం: పివిపి సినిమా-మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్-ఓక్ ఎంటర్ టైన్మెంట్, దర్శకత్వం: ఓంకార్!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.