close
Choose your channels

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రాజు గారింట్లో 7వ రోజు'

Tuesday, January 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అజయ్, భరత్, అర్జున్, వెంకటేష్, సుష్మిత ప్రధాన పాత్రల్లో భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్ రాజ దర్శకత్వంలో భరత్ కుమార్ పీలం నిర్మించిన సినిమా 'రాజుగారింట్లో 7వ రోజు'. ఈ చిత్రం రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. ఈ సినిమాను ఈ జనవరి నెలలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా..

భరత్ మాట్లాడుతూ ` ఈ మధ్య కాలంలో హారర్ సబ్జెక్ట్స్ తో వస్తోన్న సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. సినిమాలో కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ట్రైలర్స్, సాంగ్స్ చాలా బావున్నాయి. మూవీ అవుట్ పుట్ బాగా వచ్చింది. మంచి హారర్ ఫిలిం. ఖచ్చితంగా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ట్రైలర్స్, సాంగ్స్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది'' అని చెప్పారు.

దర్శకుడు ఫిరోజ్ రాజ మాట్లాడుతూ.. ''క్రైమ్ ఆధారంగా రూపొందించిన ఓ హారర్ ఫిలిం ఇది. స్క్రీన్ ప్లే చాలా బావుంటుంది. ప్రతి ఒక్కరు కష్టపడి ఈ సినిమా చేశారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

ఈ చిత్రానికి నిర్మాత: భరత్ కుమార్ పీలం, రచన,దర్శకత్వం: ఫిరోజ్ రాజ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: క్రాంతి కె.కుమార్, మ్యూజిక్: కనిష్క్, ఎడిటర్: అనిల్, స్టిల్స్: నాగభూషణం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.