close
Choose your channels

ఈరోజు నుండి రాజమండ్రిలో రామ్ చరణ్ షూటింగ్ స్టార్ట్

Sunday, April 2, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌రణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ఫై ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈరోజు(ఏప్రిల్‌2) నుండి రాజ‌మండ్రిలో ప్రారంభం అవుతుంది. రీసెంట్‌గా ధృవ చిత్రంతో మ‌రో సెన్సేష‌న‌ల్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్న రామ్‌చ‌ర‌ణ్‌తో క్రేజీ డైరెక్ట‌ర్ సుకుమార్ సినిమా అన‌గానే సినిమా ఇటు ప్రేక్ష‌కుల్లో , అటు అభిమానుల్లో ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌లో శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన అన్ కాంప్ర‌మైజ్‌డ్ ప్రొడ్యూస‌ర్స్ న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌(సి.వి.ఎం) ఈ సినిమాను రూపొందిస్తుండ‌టంతో సినిమా ఎంత భారీ రేంజ్‌లో రానుందోన‌ని సినీ ట్రేడ్ వ‌ర్గాలు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాయి.

రాజ‌మండ్రి ద‌గ్గ‌ర ఓ గ్రామంలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య పెద్ద షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. యూనిక్ స్క్రిప్ట్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర‌ణ్ చేయ‌న‌టువంటి స‌రికొత్త గెట‌ప్, లుక్‌తో ఈ చిత్రంలో క‌న‌ప‌డనున్నాడు. చ‌ర‌ణ్ లుక్ డిఫ‌రెంట్‌గా, స్ట‌యిలిష్‌గా ఉండేలా సుకుమార్ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మే కాకుండా స్పెష‌ల్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌తో చ‌ర‌ణ్ కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేయిస్తున్నారు. సినిమాలో హీరో, హీరోయిన్ స‌హా అన్నీ క్యారెక్ట‌ర్స్ కాస్ట్యూమ్స్ విష‌యంలో స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నారు డైరెక్ట‌ర్ సుకుమార్‌. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా, స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తుంది. జూలైకంతా సినిమాను పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.