close
Choose your channels

భర్త కోసం రంభ కోర్టులో పిటిషన్..!

Wednesday, October 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌న అందం అభిన‌యంతో ఆక‌ట్టుకుని తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకున్న అందాల తార రంభ‌. పెళ్లి చేసుకుని సెటిలైన రంభ ఇప్పుడు వార్త‌ల్లో నిలిచింది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...కెన‌డా వ్యాపారి ఇందిర‌న్ ప‌ద్మ‌నాధ‌న్ ను రంభ పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. అయితే కుటుంబ క‌ల‌హాల వ‌ల‌న ఈ దంప‌తులు కొన్నాళ్లుగా విడిగా ఉంటున్నారు.
ఇప్పుడు త‌న భ‌ర్త‌తో త‌నను క‌ల‌పాల‌ని, మ‌ళ్ళీ అత‌నితో క‌లిసి జీవిస్తాన‌ని సినీ న‌టి రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్ర‌యించారు. హిందూ వివాహ చ‌ట్టంలోని సెక్ష‌న్ 9 ప్ర‌కారం పిటిష‌న్ వేసారు. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం భార్య లేక భ‌ర్త స‌రైన కార‌ణం లేకుండానే భాగ‌స్వామి నుంచి విడిపోయిన‌ప్పుడు ఆ జంట‌లో వేరుగా ఉండ‌డం ఇష్టం లేని వ్య‌క్తి త‌న దాంప‌త్య హ‌క్కుల కోసం త‌మ‌ని క‌ల‌పాల‌ని కోరుతూ కోర్టును ఆశ్ర‌యించ‌వ‌చ్చు. రంభ కేసు విష‌యంలో త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ‌ను కోర్టు డిసెంబ‌ర్ 3న చేప‌ట్ట‌నుంద‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.