close
Choose your channels

మే 27న మాస్‌ హీరో విశాల్‌ 'రాయుడు'

Saturday, May 21, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాస్‌ హీరో విశాల్‌, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు'. విశాల్‌ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఈరోజు(మే 20) తమిళ్‌లో విడుదలై భారీ ఓపెనింగ్స్‌ సాధించి సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. మే 27న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదలవుతోంది.

'రాయుడు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ - ''ఈరోజు తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. విశాల్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ ఓపెనింగ్స్‌ సాధించి రికార్డు క్రియేట్‌ చేస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మే 27న రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. తెలుగులో కూడా ఈచిత్రం ఘనవిజయం సాధిస్తుంది'' అన్నారు.

మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ - ''మార్కెట్‌లో పనిచేసే ఒక లోడ్‌మెన్‌కి లోకల్‌ పొలిటీషియన్‌కి మధ్య జరిగే వార్‌ ఏవిధంగా ఉంటుందో 'రాయుడు'లో చూపిస్తున్నాం. తమిళ్‌ వెర్షన్‌కి మధురై బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఓ స్టోరీ. అదే ఫ్లేవర్‌ మిస్‌ అవకుండా అనంతపూర్‌ రాప్తాడు విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే విధంగా తెలుగులో వుంటుంది. ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తమిళ్‌లో ఘనవిజయం సాధించింది. తెలుగులో కూడా పెద్ద హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాను'' అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.