close
Choose your channels

'నగరం' ను సక్సెస్ చేసన ఆడియెన్స్ థాంక్స్ : రెజీనా

Wednesday, March 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా, రెజీనా కథానాయికగా అశ్వనికుమార్‌ సహదేవ్‌ సమర్పణలో ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పొటెన్షియల్‌ స్టూడియోస్‌ పతాకాలపై లోకేష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నగరంస‌. తెలుగు, త‌మిళంలో విడుద‌లైన ఈ సిమిమా మార్చి 10న విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించిన నేప‌థ్యంలో హీరో సందీప్ కిష‌న్‌, హీరోయిన్ రెజీనాలు త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

నేను, సందీప్ క‌లిసి చేసిన మూడో సినిమా న‌గరం సినిమాకు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావ‌డం ఎంతో హ్యాపీగా ఉంది. సినిమా త‌మిళ నెటివిటీతో ఉన్నా ప్ర‌జలు ఎంత‌గానో ఆద‌రిస్తున్నారు. ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు సినిమాను ఎంత‌గానో ఆద‌రిస్తున్నారు. ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ సినిమాను చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఇలాంటి సినిమాను ఆదిరిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ అని రెజీనా తెలిపారు.
సినిమా విడుద‌ల స‌మ‌యంలో నేను, రెజీనా వేరే సినిమా షూటింగ్ కోస‌మ‌ని మ‌లేషియాలో ఉన్నాం. అయితే సినిమా రిలీజైన త‌ర్వాత సినిమా చాలా బావుందంటూ రివ్యూస్ కూడా వ‌చ్చాయి. సినిమా రిపోర్ట్ కూడా చాలా పాజిటివ్‌గా రావ‌డంతో ఎంతో హ్య‌పీగా ఫీల‌య్యాం. మంచి కంఎటెంట్ ఉన్న ఈ సినిమాను ప్రేక్ష‌కులు సినిమాను ఆదరిస్తున్నారు. లోకేష్ క‌న‌క‌రాజ్ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. సినిమా ఇప్పుడు రెండో వారంలో ఎంట‌ర్ అయ్యింది. మ‌రిన్ని థియేట‌ర్స్ పెరిగాయి. సినిమా ఇంకా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నామ‌ని హీరో సందీప్ కిష‌న్ అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.