close
Choose your channels

గాయపడిన ఫ్యాన్ కి ఆర్ధిక సహాయం అందించిన సాయి ధరమ్ తేజ్ - దిల్ రాజు

Sunday, November 1, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొద్ది వారల క్రితం సాయి ధరమ్ తేజ్ - హరీష్ శంకర్ ల 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సక్సెస్ టూర్ జరుగుతుండగా, అనుకోని విధం గా కాకినాడ లో చిన అప్పన్న అనే ఒక ఫ్యాన్ గాయపడ్డాడు. ఈ ఘటన పై ఆ రోజున హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకులు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు విచారం వ్యక్తం చేసి, గాయపడిన అప్పన్న చికిత్సకు అయ్యే ఖర్చు తామే భరిస్తామని తెలిపారు.

చెప్పిన విధం గా నే ఈ రోజు దిల్ రాజు కార్యాలయం లో అప్పన్న కుటుంబ సభ్యులకు హీరో సాయి ధరమ్ తేజ్ 50 వేలు, నిర్మాత దిల్ రాజు 50 వేలు అందించారు. మొత్తం లక్ష రూపాయలు అందుకున్న కుటుంబ సభ్యులను, అప్పన్న ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దర్శకులు హరీష్ శంకర్ కూడా అప్పన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్టార్స్ ని కలుసుకునే సమయం లో, ఆడియో ఫంక్షన్స్ మరియు సక్సెస్ టూర్స్ వంటి కార్యక్రమాల్లో ఫాన్స్ జాగ్రత్త గా ఉండాలని హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సందర్భం గా విజ్ఞప్తి చేసారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.