close
Choose your channels

జర్నలిస్ట్ ల పై '2.0' టీం దాడి...శంకర్ క్షమాపణ

Wednesday, March 22, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ ర‌జీనీకాంత్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రోబో సీక్వెల్ 2.0 ప్ర‌స్తుతం ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలను కూడా జ‌రుపుకుంటున్న ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్‌పై శుభ‌క‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళికి సినిమాను విడుద‌ల చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఎమీజాక్స‌న్ కూడా న‌టించింది. ప్యాచ్ వ‌ర్క్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో కొంత మంది ఫోటో జ‌ర్న‌లిస్టులపై 2.0 యూనిట్‌కు చెందిన బౌనర్స్ దాడి చేశార‌ట‌. ఈ కేసు పోలీసుల వ‌ర‌కు వెళ్ళింద‌ట‌. అయితే డైరెక్ట‌ర్ శంక‌ర్ సీన్‌లోకి ఎంట‌రై..ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌ను నిర్వ‌హించి..ఏదో తెలియ‌కుండా జ‌రిగిన త‌ప్ప‌ని, భ‌విష్య‌త్‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు రిపీట్ కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని మీడియాకు క్ష‌మాప‌ణ చెప్పాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.