close
Choose your channels

అలా చేయడం తప్పేనంటున్న రాజమౌళి

Sunday, July 9, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాహుబ‌లి చిత్రంతో తెలుగు సినిమా స్థాయి అంత‌ర్జాతీయ స్థాయికి పెరిగింది. ఈ సినిమాలో ప్ర‌తిపాత్ర హైలైట్‌గా నిలిచింది. అందులో ఒక పాత్ర ర‌మ్య‌కృష్ణ న‌టించిన శివ‌గామి. ముందుగా యూనిట్ ఈ పాత్ర కోసం శ్రీదేవిని తీసుకోవాల‌నుకున్నారు. కానీ చివ‌ర‌కు ర‌మ్య‌కృష్ణ శివ‌గామిగా మెప్పించింది. సినిమా విడుద‌లై పెద్ద హిట్ అయిన త‌ర్వాత రాజ‌మౌళి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి భారీ పారితోష‌కంతో పాటు, షేర్‌లో భాగ‌మ‌డిగార‌ని తెలియ‌జేశాడు. కొన్ని రోజుల క్రితం రాజ‌మౌళి చెప్పిన ఈ మాట‌లు సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి.

అయితే మామ్ ప్ర‌మోష‌న్‌లో శ్రీదేవి ఈ విష‌యంపై కౌంట‌ర్ ఎటాక్ ఇచ్చింది. తాను రాజ‌మౌళిని ఏం అడ‌గ‌లేదంటూ త‌న‌దైన శైళిలో స‌మాధానాలు చెప్పుకొచ్చింది. రీసెంట్‌గా రాజ‌మౌళి ఓ అంగ్ల వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ..శ్రీదేవిగారంటే నాకు అపారమైన గౌర‌వముంది. ఎవ‌రి వాద‌న‌ల‌ను న‌మ్మాలో ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకుంటారు. అయితే అస‌లు విష‌యాన్ని తాను బ‌హిరంగంగా మాట్లాడి ఉండాల్సింది కాద‌ని, ఆ విష‌యంలో తాను చేసింది త‌ప్పేనంటూ చెప్పుకొచ్చాడు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.