బోయ‌పాటి కావాల‌నే లేట్ చేస్తున్నాడా?

  • IndiaGlitz, [Monday,October 22 2018]

రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో ఓసినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి విన‌య విధేయ రామ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. అయితే ఈ సినిమాను అనుకున్నంత స్పీడుగా తెర‌కెక్కించ‌డం లేద‌ట ద‌ర్శ‌కుడు బోయ‌పాటి.

ఇంకా ముప్పై రోజుల‌కు పైగా షూటింగ్ డేట్స్ పెండింగ్‌లో ఉన్నాయ‌ట‌. మ‌రో వైపు చ‌ర‌ణ్ కోసం రాజ‌మౌళి ఎదురుచూస్తున్నాడు. మ‌ధ్య‌లో డేట్స్ ఎలా అడ్జ‌స్ట్ చేస్తార‌నేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింద‌ట‌. నిజానికి ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేసేలా ప్లాన్స్ చేసుకున్నారు.

అయితే ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' కూడా జ‌న‌వ‌రిలో విడుద‌ల‌కు సిద్ధమ‌వుతుంది కాబ‌ట్టే.. బోయ‌పాటి కావాల‌నే ఈ సినిమాను ఆల‌స్యం చేస్తున్నాడ‌ని మెగా క్యాంప్‌లో వార్త‌లు వ‌స్తున్నాయట‌. అదీ గాక ఈ చిత్రానికి ఇంకా పాట‌లు ఇంకా రెడీ కాలేదు. వాటిని ఎప్పుడూ పూర్తి చేయ‌బోతున్నాడో కూడా క్లారిటీ రావ‌డం లేదు. మ‌రి దీనిపై మెగా కాంపౌండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

More News

సంచ‌ల‌నం రేపుతున్న సిద్ధార్థ ట్వీట్స్‌

తెలుగు, త‌మిళంలో విజ‌యాలు అందుకున్న హీరో ఇప్పుడు ఎక్కువ‌గా త‌మిళంలోనే సినిమాలు చేస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న త్రిభాషా చిత్రం గృహం మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

రాజ‌మౌళిని క‌లిసిన ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ట్రైన‌ర్‌

బాహుబ‌లి త‌ర్వాత రాజమౌళి త‌దుప‌రి చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకు త‌గిన విధంగా రాజ‌మౌళి భారీ బ‌డ్జెట్‌తో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ వంటి స్టార్ హీరోల‌తో సినిమా చేస్తున్నాడు.

తెలుగు తెర వైభవాన్ని పెంచిన రాజసం... ప్రపంచ సినీ ప్రేక్షకుల అభిమానం తన కైవశం

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు నటవారసుడుగా పరిచయమైన ప్రభాస్‌ 'హీరో అంటే ఇలా ఉండ్రాలా' అనేలా అందరినీ ఆకట్టుకునే ఆరడుగుల అజానబాహుడు.

బుల్లితెర‌పై శ్రుతి

క‌మ‌ల్ ముద్దుల త‌నయ శ్రుతిహాస‌న్ ఎందుక‌నో సినిమా రంగానికి చాలా దూరంగా ఉంటున్నారు.

మీ టూపై రెహామాన్ ఆశ్య‌ర్యం!

ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహమాన్‌ను మీ టూ వ్య‌వ‌హారం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.