నీ కన్నా ఏజ్ ఎక్కువున్న నటితో డేటింగ్ ?.. హీరో ఆన్సర్ విన్నారా!

  • IndiaGlitz, [Saturday,May 22 2021]

ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ సెలెబ్రిటీల మద్య జరుగుతున్న ప్రేమ వ్యవహారాలు చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ లో ఈ తంతు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రియాంక చోప్రా తన కన్నా పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. సీనియర్ హీరోయిన్ సుస్మిత సేన్ కూడా ప్రస్తుతం ఓ యువకుడితో ఎఫైర్ సాగిస్తోంది. కానీ వార్తల్లో ఎప్పుడూ నిలిచేది మాత్రం సెక్సీ బ్యూటీ మలైకా, అర్జున్ కపూర్ జోడినే.

అర్భాజ్ ఖాన్ తో విడాకులైన తర్వాత మలైకా, అర్జున్ కపూర్ మద్య ఎఫైర్ మొదలయింది. అర్జున్ కపూర్ కన్నా మలైకా వయసులో 12 ఏళ్ళు పెద్ద. అర్భాజ్ ఖాన్ తో ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఈ అంశాలన్నింటి వల్ల అర్జున్ కపూర్,మలైకా ఎఫైర్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇదీ చదవండి: నితిన్ హీరోయిన్ సెన్సేషనల్ ఫోటోషూట్.. టాప్ లెస్ గా హాట్ షో!

2019 నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ మీడియా ముందు మాత్రం తమ వ్యక్తిగత విషయాలని ఈ జంట రివీల్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం జంటగా ఫోటోలు షేర్ చేస్తూ తమ బంధాన్ని చెప్పకనే చెబుతున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఎఫైర్ కి సంబంధించిన ప్రశ్న అర్జున్ కపూర్ కి ఎదురైంది. ఈ ప్రశ్నకు అర్జున్ కపూర్ చికాకు తెచ్చుకోకుండా తెలివిగానే సమాధానం ఇచ్చాడు. తన పాస్ట్ మ్యారేజ్ ద్వారా ఓ కొడుకు ఉండి, వయసులో పెద్దైన మహిళతో డేటింగ్ చేయడం పట్ల స్పందిస్తారా అనే ప్రశ్న ఎదురైంది.

దీనికి అర్జున్ కపూర్ బదులిస్తూ.. నా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడను. కానీ ఒక్క విషయం ఏంటంటే.. మన భాగస్వామిని మనం గౌరవించాలి. ఆమెకున్న గతం గతమే. ఆమె ఎంచుకున్న బౌండరీలని కూడా కాదనకూడదు. వ్యక్తిగత విషయాల గురించి బయట మాట్లాడడం వల్ల పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. కానీ ఆమె కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేయగలను అని అర్జున్ కపూర్ బదులిచ్చాడు.

More News

నితిన్ హీరోయిన్ సెన్సేషనల్ ఫోటోషూట్.. టాప్ లెస్ గా హాట్ షో!

నితిన్ నటించిన ధైర్యం చిత్రం గుర్తుందిగా. 2005 లో తేజ దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ రైమా సేన్ నటించింది

ఇకపై ఉదయం 10 గంటల నుంచి సరిహద్దులు బంద్: డీజీపీ మహేందర్‌రెడ్డి

తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఆంక్ష‌లను మ‌రింత క‌ఠిన‌త‌రం చేశారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర స‌రిహ‌ద్దులు మూసివేస్తామని

డీఎల్ఎఫ్ ముడుపుల కేసులో లాలూకు సీబీఐ క్లీన్‌చిట్ ?

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) క్లీన్‌చిట్ ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

ముంచుకొస్తున్న ‘యాస్’ తుపాను.. భారత నావికాదళం అప్రమత్తం

ఒకవైపు కరోనా మహమ్మారి.. మరోవైపు తుపానులు భారత్‌ను పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమతీరాన్ని వణికించిన ‘తౌక్టే’ తుపాను కాస్త బలహీన పడిందని ఆనందిస్తున్న తరుణంలో విశాఖ

ఆనందయ్య మందుపై ఆయుష్ పాజిటివ్ రిపోర్ట్..

కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్‌ కమిషనర్‌ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతున్న విషయం తెలిసిందే.