బ్రేకింగ్ : హీరో సాయి ధరమ్ తేజ్‌కు మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద ప్రమాదం, అపస్మారక స్థితిలో మెగాహీరో

  • IndiaGlitz, [Friday,September 10 2021]

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గుర‌య్యారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్ రోడ్డు నెం 45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జి దాటాక కోహినూర్ హోటల్ సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ నుంచి ఒక్కసారిగా కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్ తేజ్‌ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ప్రమాద విషయం తెలుసుకున్న సాయిధరమ్ తేజ్ కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అటు తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ప్రమాద వివరాలను సేకరిస్తున్నారు.

More News

విశాల్ `సామాన్యుడు` సెకండ్ లుక్...డిసెంబ‌ర్‌లో గ్రాండ్ రిలీజ్‌

యాక్ష‌న్‌ హీరో విశాల్ కెరీర్‌లో 31వ మూవీగా రూపొందుతోన్న చిత్రం `సామాన్యుడు`. “నాట్ ఎ కామన్ మ్యాన్”

'లవ్ స్టోరి' సెప్టెంబర్ 24న విడుదల

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి".

'బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫ్ ర్' ఫస్ట్ లుక్ టైటిల్ లోగో లాంఛ్ చేసిన స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి

ఇంద్రసేన, సంతోష్ రాజ్, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫ్ ర్".

తెలుగు, హిందీ  భాషల్లో థియేటర్స్ లలో విడుదలకు సన్నాహాలు చేసుకొంటున్న 'స్ట్రీట్ లైట్'

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా

‘సీటీమార్‌’ థియేట‌ర్స్‌లో చూసే సినిమా.. త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో గోపీచంద్‌

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన భారీ స్పోర్ట్స్ క‌మ‌ర్షియ‌ల్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’.