close
Choose your channels

బ్రేకింగ్ : హీరో సాయి ధరమ్ తేజ్‌కు మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద ప్రమాదం, అపస్మారక స్థితిలో మెగాహీరో

Friday, September 10, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బ్రేకింగ్ : హీరో సాయి ధరమ్ తేజ్‌కు మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద ప్రమాదం, అపస్మారక స్థితిలో మెగాహీరో

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గుర‌య్యారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్ రోడ్డు నెం 45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జి దాటాక కోహినూర్ హోటల్ సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ నుంచి ఒక్కసారిగా కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్ తేజ్‌ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ప్రమాద విషయం తెలుసుకున్న సాయిధరమ్ తేజ్ కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అటు తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ప్రమాద వివరాలను సేకరిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.