రెండే రెండు నిమిషాల్లో 1.1 బిలియన్ డాలర్ల నష్టం..

  • IndiaGlitz, [Friday,April 05 2019]

ఎలక్ట్రిక్‌ కార్ల సంచలనం టెస్లా సీఈవో, స్పేస్‌ఎక్స్‌ ఫౌండర్‌ ఎలాన్ మస్క్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల ఆయన చేసిన ఓ ట్వీట్‌తో చైర్మన్ పదవిని పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కొత్తగా రాబిన్ డెన్‌హోమ్‌ను నియమించడం జరిగింది. దీంతో షాక్‌తిన్న ఆయన దాని నుంచి తేరుకోక ముందే మరో భారీ షాక్ తగిలింది.

కేవలం రెండే రెండు నిమిషాల్లో 1 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయాడు. గురువారం న్యూయార్క్ ట్రేడింగ్ ఆరంభమైన ఆదిలోనే అనగా.. రెండు నిమిషాల్లోనే టెస్లా కంపెనీ షేర్లు భారీగా కుప్పకూలిపోయాయి. దీంతో ఆయన భారీగా నష్టం వాటిల్లింది.

కేవలం రెండు నిమిషాల్లోనే టెస్లా కంపెనీ షేర్లు 11 శాతం మేర పడిపోవడంతో భారీ షాక్ తగిలినట్లైంది. దీంతో ఎలాన్ మస్క్ 1.1 బిలియన్ డాలర్ల సంపద మొత్తం ఆవిరైంది. కాగా.. ఆ 1.1 బిలియన్ డాలర్లు మొత్తం మన రూపాయల్లో దాదాపు రూ.70,00,00,00,000. అయితే ఒక్కసారిగా ఇంత పెద్ద మోత్తం తుడిచిపెట్టుకుని పోవడం గమనార్హం.

ఒక బిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు తుడిచిపెట్టుకుపోవడంతో ఆయన నికర సంపద 22.3 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్‌బ్లర్గ్ ఓ నివేదికలో స్పష్టంచేసింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టెస్లా అమ్మకాలు భారీగా తగ్గాయి.

గతేడాది నాలుగవ త్రైమాసికంలో 90, 966లుగా ఉన్న టెస్లా కార్ల అమ్మకాలు ప్రస్తుతం 63,000లకు పడిపోవడంతోనే కంపెనీ షేర్లు భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఎలాన్ మస్క్‌ చాలా సమయమే పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

More News

క్యాపిటల్స్ వరుస ఓటమికి కారణాలివే!

ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు వరుసగా ఓటమి పాలవ్వడంతో అటు క్రీడాభిమానులు.. ఇటు నిర్వాహకులు తీవ్ర అసంతృప్తి ఉన్నారు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆరంభం మొదలుకుని

ఏప్రిల్‌ 6న 'మహర్షి' టీజర్‌ విడుదల

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌,

'ప్రశ్నిస్తా' చాలా గొప్పగా ఉంటుంది: ఆర్. నారాయణమూర్తి

మనీష్  బాబు హీరోగా రాజా వన్నెంరెడ్డి  దర్శకత్వంలో  జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పి. సత్యారెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ప్రశ్నిస్తా. అక్షిత, హసీస్, షిప్రా కౌర్

క‌ల్యాణ్‌రామ్ ఇంకో సినిమా

క‌ల్యాణ్‌రామ్ ఇప్పుడు మాంచి స్పీడు మీదున్నారు. వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్ప‌టికే ఆయ‌న న‌టించిన మూడు సినిమాలు విడుద‌ల‌య్యాయి.

పాప తండ్రిగా ర‌వితేజ‌

ర‌వితేజ హీరోగా `క‌న‌క‌దుర్గ‌` అనే సినిమా మొద‌లుకానుంది. ఈ సినిమాకు సంతోష్ శ్రీన్‌వాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.