కడప జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది మృతి

  • IndiaGlitz, [Saturday,May 08 2021]

కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మామిళ్ళపల్లె శివారులోని తిరుమల కొండ సమీపంలో ఉన్న బైరటీస్ గనిలో భారీ ప్రమాదం జరిగింది. ఈ గనుల వద్ద జిలెటిన్ స్టిక్స్ పేలడంతో 10 మంది మరణించారు. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు ధాటికి కనీసం గుర్తించేందుకు సైతం వీలులేని విధంగా శరీరానలన్నీ తునా తునకైలైపోయాయి. దీంతో మృతదేహాలను గుర్తించేందుకు వీలు లేకుండా పోయింది. మృతదేహాల కోసం ఘటనా స్థలానికి సమీపంలో పోలీసులు గాలిస్తున్నారు.

Also Read: కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న పవన్

మృతులందరూ పులివెందుల ప్రాంతంలోని వేములకు చెందినవారని తెలుస్తోంది. గనుల్లో పేల్చే పనుల కోసం పులివెందుల ప్రాంతం నుంచి కార్మికులు వచ్చారు. కాగా.. నేడు జీపులో నుంచి జిలెటిన్ స్టిక్స్ దించే సమయంలో పేలుడు సంభవించింది. ఘటనా స్థలాన్ని పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి, కలసపాడు, పోరుమామిళ్ల ఎస్‌ఐలు మద్దిలేటి, మోహన్ పరిశీలించారు. భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

జగన్, చంద్రబాబు దిగ్ర్భాంతి

ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటనకు గల కారణాలను జగన్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుడు ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

More News

కొవిడ్‌ వ్యాక్సిన్ కొరత.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం

తెలంగాణలో కొవిడ్‌ టీకా డోసుల కొరత దృష్ట్యా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న పవన్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.

స్టాలిన్ మంత్రివర్గంలో ఏడుగురు తెలుగు వారికి ప్రాధాన్యం..

తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.

పుట్ట మధు అరెస్ట్.. ఈటల అనుచరులే టార్గెట్?

పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధును పోలీసులు అరెస్ట్ అయ్యారు. ఆయనను భీమవరంలో అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 30 విమానాల రద్దు

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు వెళ్లాల్సిన పలు దేశీయ విమాన సర్వీసులను శుక్రవారం అర్ధరాత్రి నుంచి అధికారులు రద్దు చేశారు.